ఉత్తం దంపతులను విమర్శించే అర్హత బొల్లంకు లేదు

Aug 21, 2024 - 19:11
 0  49
ఉత్తం దంపతులను విమర్శించే అర్హత బొల్లంకు లేదు

బట్టు శ్రీహరి ఓయూ టీజేఏసీ చైర్మన్ 

కోదాడ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రేట్లు విమర్శించే కనీస అర్హత మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు లేదని పదవుల కోసం పార్టీల వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్ముకున్న వారిని పంగనామాలు పెట్టిన ఘనత ఆయనందని ఓయూ టీఎస్ జేఏసీ చైర్మన్ బట్టు శ్రీహరి నాయక్ అన్నారు. బుధవారం కోదాడ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల్లో అదృష్టం కొద్ది స్వల్ప మెజార్టీతో గెలిచి నియోజకవర్గాన్ని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా గంజాయి కేంద్రంగా మార్చిన బొల్లం మల్లయ్య యాదవ్ ఉత్తం దంపతులను విమర్శించడం దయాలు వేదాలు వెళ్ళినట్టు ఉందన్నారు. కోదాడ ప్రాంత ప్రజల మల్లయ్యను మరిచిపోయి 8 నెలలు దాటిందని ఇప్పుడు సొంత గ్రామాల్లో వార్డు సభ్యుడు కూడా గెలవడని అన్నారు. కోదాడలో మట్టిని ఇసుకను అమ్ముకున్న నీచ బుద్ధి మల్లయ్యదని రియల్ ఎస్టేట్ వెంచర్ లో నుంచి డబ్బులు వసూలు చేసే ప్రజల చేత చిత్కారానికి గురైన మల్లయ్య యాదవ్ నాలుకను అదుపులో పెట్టుకోవాలని లేని పక్షంలో తగిన విధంగా బుద్ధి చెప్పడానికి ఓయూ జెఏసి సిద్ధంగా ఉందన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333