ఈ నెల23 న విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయండి. పి.డి.ఎస్.యు

Jul 19, 2025 - 19:39
 0  6
ఈ నెల23 న విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయండి.   పి.డి.ఎస్.యు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఈ నెల23 న విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయండి. పి.డి.ఎస్.యు మండల నాయకులు బోర లెనిన్..* తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23 న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు పి.డి.ఎస్.యు నాయకులు ప్రకటించారు.ఆత్మకూరు ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని బస్టాండ్ దగ్గర పి.డి.ఎస్.యు ఆధ్వరంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు మండల నాయకులు బొర లెనిన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తామని చెప్పి తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందనీ అన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి దిక్కులేడని తక్షణమే నియమించాలన్నారు. ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈవో, డీఈవో పోస్టులను భర్తీ చెయ్యాలనీ డిమాండ్ చేశారు. ఇంటర్ కళాశాలలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలనీ, పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలనీ అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలు కల్పించి, నిధులు కేటాయించాలనీ కోరారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చెయ్యాలనీ,సంక్షేమ హాస్టల్ తో పాటు గురుకులాలకు సొంతభవనాలు నిర్మాణం చేయాలి, ప్రతి మండలంలో గురుకులాలు, మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి, విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు ఇవ్వాలనీ,నూతన జాతీయ విద్యా విధానాన్నీ తెలంగాణలో అమలు చెయ్యకుండా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ 23న మండలంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్ లో భాగస్వామ్యం కావాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీ.డీ.ఎస్.యు నాయకులు ప్రవీణ్, నవీన్, వినయ్, పవన్, రవి,మహేష్,మనోజ్,రాజు తదితరులు పాల్గొన్నారు.