ఆలస్యంగా బయలుదేరిన ఆరగిద్ద- గట్టు బస్సు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు
జోగులాంబ గద్వాల 27 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా కేంద్రంలో ఈ రోజు మధ్యాహ్నం 1.30.బయలు దేరాల్సిన మల్దకల్ - మద్దెలబండ, ఆరగిద్ద- గట్టు బస్సు 2.20 కి బయలు దేరింది.గట్టుకు నాలుగు గంటలకు చేరుకుంటుంది. మండిపడిన ప్రయాణికులు గట్టు మండలంకు చెందిన ప్రయాణికులు గద్వాల బస్టాండ్ లో 1.00 నుండి, విద్యార్థులు, వృద్దులు, పిల్లలు ఆకలి దబ్బికతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. బస్సు సంగతి అడుగుదామంటే బస్టాండ్ లో చెప్పేవారు ఎవరు లేరు, అక్కడ ఉన్న ఫోన్ నెంబర్ కు పోన్ చేస్తే, ఒకరు నేను డ్యూటీ లేననీ, మరోకరు అక్కడ ఉన్నవారిని అడగండని సమాధానం ఇచ్చారు. ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమయానికి బస్సు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.