ఆలస్యంగా బయలుదేరిన ఆరగిద్ద- గట్టు బస్సు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు

Apr 27, 2024 - 20:04
Apr 27, 2024 - 20:08
 0  49

జోగులాంబ గద్వాల 27 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా కేంద్రంలో ఈ రోజు మధ్యాహ్నం 1.30.బయలు దేరాల్సిన మల్దకల్ - మద్దెలబండ, ఆరగిద్ద- గట్టు బస్సు 2.20 కి బయలు దేరింది.గట్టుకు నాలుగు గంటలకు చేరుకుంటుంది. మండిపడిన ప్రయాణికులు గట్టు మండలంకు చెందిన ప్రయాణికులు గద్వాల బస్టాండ్ లో 1.00 నుండి, విద్యార్థులు, వృద్దులు, పిల్లలు ఆకలి దబ్బికతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. బస్సు సంగతి అడుగుదామంటే బస్టాండ్ లో చెప్పేవారు ఎవరు లేరు, అక్కడ ఉన్న ఫోన్ నెంబర్ కు పోన్ చేస్తే, ఒకరు నేను డ్యూటీ లేననీ, మరోకరు అక్కడ ఉన్నవారిని అడగండని సమాధానం ఇచ్చారు. ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమయానికి బస్సు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333