అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
➤ జిల్లా పోలీస్ కార్యాలయంలో నో హెల్మెంట్ నో ఎంట్రీ అమలు
జోగులాంబ గద్వాల 25 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్–అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం రెండవ దశలో భాగంగా జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో "నో హెల్మెంట్ నో ఎంట్రీ " అమలు పరుస్తున్నట్లు, అలాగే జిల్లాలోని ఆటో, లారీ, టాక్సీ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించబడినట్లు జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్. తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో సుమారు 200 మంది డ్రైవర్లు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. డ్రైవర్ దృష్టి సామర్థ్యం రోడ్డు భద్రతలో కీలక పాత్ర పోషిస్తుందని, స్వల్ప నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశముందని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ తన ఆరోగ్యం, ముఖ్యంగా కంటి చూపు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనం ఫిట్నెస్ ఎంత ముఖ్యమో, డ్రైవర్ ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యమని తెలిపారు. అవసరమైతే తగిన చికిత్స తీసుకుని కళ్లద్దాలు ఉపయోగించాలని సూచించారు. ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ప్రతి వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్ డ్రైవర్లు మరియు ప్రయాణికులు సీట్బెల్ట్ వినియోగించాలని సూచించారు.మద్యం సేవించి వాహనం నడపకూడదని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, పరిమిత వేగంతో ప్రయాణించాలని, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి బాధ్యత ముఖ్యమని స్పష్టం చేశారు.
అలాగే ఇకపై ఏదైనా అవసరం పడి పోలీస్ కార్యాలయానికి వచ్చే ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి రావాలని, అలాగే ఫోర్ వీలర్ లో వచ్చే వారు సీట్ బెల్ట్ ధరించి రావాలని లేని యెడల ఆఫీసు లోనికి అనుమతించడం జరగదని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గారితో పాటు జిల్లా అదనపు ఎస్పీ కేశంకర్, గద్వాల్ డిఎస్పి వై. మొగిలయ్య, స్పెషల్ బ్యాంకింగ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, గద్వాల్ సర్కిల్ ఆఫీసర్ టంగుటూరి శ్రీను గద్వాల్ పట్టణ ఎస్ఐలు సతీష్ కుమార్ రెడ్డి జహంగీర్ గద్వాల ట్రాఫిక్ ఆర్ఎస్ఐ బాలచంద్రుడు మరియు సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రమణవాణి, తహిరిన్, శ్రావణి, నర్సింగ్ ఆఫీసర్స్ ఈశ్వరమ్మ, శ్రీకాంత్, ఏ.ఎన్.ఎమ్ లు, తదితరులు పాల్గొన్నారు.