అధికారుల పర్యవేక్షణ లోపంతో విద్యా వ్యవస్థ

Aug 23, 2024 - 20:21
Aug 23, 2024 - 20:23
 0  11
అధికారుల పర్యవేక్షణ లోపంతో విద్యా వ్యవస్థ

*అధికారుల పర్యవేక్షణ లోపంతో విద్యా వ్యవస్థ*

*వెంకటాపురం మండలంలో ఎంఈఓని తక్షణమే నియమించాలి*

 *జిఎస్పి ములుగు జిల్లా అధ్యక్షులు రేగ గణేష్*

ఆగస్టు 23 వెంకటాపురం తెలంగాణ వార్త:- వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి విశ్రాంతి భవనం ఆవరణంలో శుక్రవారం నాడు గొండ్వాన సంక్షేమ పరిషత్ సంఘ నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులు పూనేం ప్రతాప్ అధ్యక్షతన వహించారు.ఈ కార్యక్రమానికి ములుగు జిల్లా అధ్యక్షులు రేగ గణేష్ పాల్గొని మాట్లాడుతూ.ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో విద్యావ్యవస్థ కుంటుపడుతుందని ఆరోపించారు.వెంకటాపురం మండలంలో ఎంఈఓ అధికారి లేక ఏజెన్సీ ప్రాంతంలో విద్య వ్యవస్థ పరివేక్షణ లోపిస్తుందని ఆరోపించారు.అధికారుల పరివేక్షన లోపంతో పాఠశాలలకు ఉపాధ్యాయులు సక్రమంగా సమయపాలన పాటించకుండా స్కూళ్లకు వెళ్తున్నారని, పర్యవేక్షించాల్సిన అధికారులు లేక ఆదివాసి పిల్లలకు విద్య బోధన సరిగ్గా అందించడంలో ఉపాధ్యాయులు విఫలం అవుతున్నారని,ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన సక్రమంగా లేక అందరు ప్రైవేట్ విద్య సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు.రెక్కాడితే కానీ డొక్కాడని ఆదివాసులకి ప్రైవేట్ స్కూళ్లలో చదివించలేక అవస్థలు పడుతున్నారని అన్నారు.ఐటిడిఏ అధికారి కూడా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పర్యవేక్షణ కరువైందని అన్నారు,ప్రభుత్వ ఆశ్రమ స్కూళ్లను నెలకు ఒక్కసారైనా విజిట్ చేయాలని, సమయపాలన పాటించకుండా ఉపాధ్యాయులు వారి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారని ఆయన అన్నారు.స్కూళ్లలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని,తక్షణమే వెంకటాపురం మండలంలో ఎంఈఓని నియమించాలని డిమాండ్ చేశారు.లేని పక్షాన గొండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసి విద్యార్థులతో కలసి రాస్తారోకో నిర్వహిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యకర్తలు మేకల మహేష్, అట్టం మొహరావు తదితరులు పాల్గొన్నారు...