32 వార్డులో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

సూర్యాపేట 06 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- :- ప్రతి ఒక్కరు భక్తి భవాన్నీ పెంపొందించుకోవాలని మాజీ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ షేక్ జహీర్ ఆధ్వర్యంలో. ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా 32 వ వార్డు 50 ఫీట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు మజ్జిగ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.