2009 అలంపూర్ వరద బాధితులకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి బిజెపి నాయకులు
జోగులాంబ గద్వాల 1 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : అలంపూర్ 2009 అలంపూర్ వరద బాధితులకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలి అని : మహబూబ్నగర్ MP డీకే అరుణమ్మ , జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు మరియు అలంపూర్ మండల అధ్యక్షుడు గొంగోల్ల ఈశ్వర్ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ BM సంతోష్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. అలంపూర్ వరద బాధితులకు 43 ఎకరాలు ఇళ్ల స్థలాలకు కేటాయించి 16 సంవత్సరాలు గడుస్తున్న ఒక్కరికి కూడా ఇళ్లస్థలం ఇవ్వకపోవడం చాలా బాధాకరం దీనిపై కలెక్టర్ వెంటనే స్పందించి బాధితులకు వెంటనే స్థలాలు ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేంద్ర గౌడ్ జిల్లా మాజీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ భరత్ తదితరులు పాల్గొన్నారు.