20000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ భూగర్భ జల అధికారి
సూర్యాపేట జిల్లా భూగర్భ జలశాఖలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. బోరు రిగ్గింగ్ అనుమతి కోసం రూ. 20 వేలు లంచం తీసుకుంటూ జిల్లా భూగర్భ జల అధికారి మెగావత్ బాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ కొసరాజు వెంకటేశ్వర్లు ఏసీబీకి చిక్కారు. నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
[5:59 pm, 15/7/2026] Jaheer Staff Reporter: బ్రేకింగ్ న్యూస్:
తెలంగాణలో అక్టోబర్ 12 వరకు SIR గడువు పొడిగింపు
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. అక్టోబర్ 12 వరకు SIR గడువు పొడిగిస్తూ EC ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో SIR గడువును పొడిగించాలని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరిన విషయం తెలిసిందే.