2 చోట్ల ఓటు ఉంటే ఎడాది చేయొద్దు: CEO
TG: 2 వేర్వేరు నియోజకవర్గాల్లో లేదా రాష్ట్రాల్లో ఓటు ఉండటం చట్టవిరుద్ధమని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఉద్దేశపూర్వకంగా 2 చోట్ల ఓటు నమోదు చేసుకుంటే ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇలాంటి కేసుల్లో ఇప్పటికే కొందరికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ (DSE) సాఫ్ట్వేర్ ద్వారా డూప్లికేట్ ఓట్లను గుర్తిస్తున్నామని వెల్లడించారు.