సూర్యాపేట నుంచి కుడ కుడ వరకు ఫ్లాగ్ మార్చ్
ఓటర్లు సజావుగా ఓటు హక్కువినియోగించుకోవాలి..
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి..
సూర్యాపేట డిఎస్పి ప్రసన్న కుమార్..
పాత నేరస్థులకు ఐదు లక్షల పూచికత్తుపై బైండోవర్ చేశాము.. ఐదు లక్షలతో పాటు రిమాండ్...
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ అన్నారు. శనివారం సూర్యాపేట నుంచి కుడ కుడ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఆటంకాలు కలిగించిన వ్యక్తులకు బైండోవర్ చేసామని, ఐదు లక్షల రూపాయలు పూచి కత్తు ఉన్నదని దాన్ని అతిక్రమిస్తే 5 లక్షల రూపాయలతో పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట, రూరల్ సిఐల తో పాటు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు...