సీతారామ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాల పనులను సమీక్షించిన వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు.
బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్,ఎస్పి రోహిత్ రాజ్ తో కలసి ములకలపల్లి మండలం పూసగూడెం సీతారామ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం పనుల ను పరిశీలించారు. గురువారం ఆగస్టు 15 న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదగా ప్రారంభోత్సవం చేయనున్న సీతారామ ఎత్తిపోతల పథకం పైలాన్ పనులు, పూజ జరుగు ప్రదేశం మరియు పాత్రికేయుల సమావేశం జరుగు ప్రదేశం ను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులకు ప్రత్యేకంగా విధులు కేటాయించారు. అధికారులు వారు చేపట్టవలసిన పనులు మరియు తీసుకోవలసిన చర్యలపై సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విద్యాచందన, ఇరిగేషన్ అధికారులు మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.