లంబాడి మహిళల నృత్యాలతో ప్రజా పాలన విజయోత్సవాలు
జోగులాంబ గద్వాల 5 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల ప్రజా పాలనా కళా యాత్ర లో భాగంగా జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ ఆదేశాల మేరకు డీపీఆర్ఒ అరిఫ్ ఉద్దీన్ సారథ్యంలో సాంస్కృతిక సారధి కళాకారుల జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ రాహుల్ నేతృత్వంలో ప్రభుత్వ పథకాల పాటలతో ఆలూరు, మల్లాపురం తండా,నల్ల గట్టు తండా లో పాటలతో జనాలను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా లంబాడీ మహిళలు నృత్యాలతో ప్రజా విజయోత్సవం విజయవంతమైంది. జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రభుత్వ కళాకారుల పాటలకు జనాలు నృత్యలు వేస్తూ తిలకించారు.ఈ కార్యక్రమం లో ప్రజలు గ్రామ పెద్దలు కళాకారులు కేశవులు, భూపతి, హాజరాత్, కృష్ణ ,కవిత స్వామి ,రమాదేవి పాల్గొన్నారు.