రేపు (అనగా) డిసెంబర్ 16, సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు
జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ - 2, పరీక్షల నేపథ్యంలో ఈనెల 16న సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలోని అధికారులు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ - 2, పరీక్షల విధులలో ఉన్నందున ఎవరు అందుబాటులో ఉండరని, ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి ఈ సోమవారం నిర్వహించి ప్రజావాణికి దరఖాస్తులతో కలెక్టరేట్ కార్యాలయానికి రావద్దని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.జారీ చేయువారు:- డిపిఆర్ఓ/ జోగులాంబ గద్వాల జిల్లా