మృతురాలు కుటుంబానికి అండగా నిలిచిన డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్
కేతేపల్లి 6 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్గొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో త్రీవంగా గాయపడి హైదరాబాద్ పవన్ సాయి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన పోకల నవనీత కుటుంబాన్ని పవన్ సాయి హాస్పిటల్ అధినేత ఆలేటి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా నవనీత భర్త పోకల మోహన్ రావుని వారి ముగ్గురు చిన్నారులను కలిసి ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని కల్పించారు.అనంతరం తన మానవతా దృక్కుపదాన్ని చాటుతూ తన వంతు సహాయంగా 10వేల రూపాయల సహాయాన్ని అందజేశారు.బాధిత కుటుంబానికి అండగా నిలిచిన డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ కి కుటుంబ సభ్యులు అభినందనలు తెలియజేశారు.