మండల అధ్యక్షులు రవివర్మ ఆధ్వర్యంలో డీజేఎఫ్ కరపత్ర ఆవిష్కరణ
జనవరి 10న కరీంనగర్ లో డీజేఎఫ్ మహాసభను విజయవంతం చేయాలి!
అడ్డగూడూరు 1 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్(డి,జె,ఎఫ్)అడ్డగూడూరు మండల అధ్యక్షులు కడియం.రవివర్మ ఆధ్వర్యంలో జనవరి10న కరీంనగర్ లో జరిగే మహాసభ కరపత్రం ఆవిష్కరణ చేశారు.కడియం. రవివర్మ మాట్లాడుతూ..ప్రజాహితమే లక్ష్యంగా పనిచేసేవారంతా జర్నలిస్ట్ లేనని.అక్షర యోధులకు చిన్న పెద్ద తారతమ్యం లేదని చాటి తిప్పుతూ జర్నలిస్టుల హక్కుల సాధనే దెయ్యంగా ఏర్పడిన ప్రగతిశీల పాత్రికేయ ఐక్య కూటమే డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్(డి,జె,ఎఫ్) అని అన్నారు.ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా ఉంటూ పనిచేసే చిన్న,పెద్ద పత్రికలతో పాటు యూట్యూబ్ న్యూస్ ఛానల్ డిజిటల్ వెబ్ మీడియాతో పాటు అన్ని రకాల మీడియాలో పనిచేసే అక్షర సైనికులు అందరికీ అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని ఆశయంతో (డీజేఎఫ్)జాతీయ స్థాయిలో పోరాటం చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పనుమటి సైదులు,చింత సుధాకర్,బాలెoల పరశురాములు,నిర్మల సందీప్, నిర్మల వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు