ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Mar 18, 2025 - 06:05
 0  212
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

తిరుమలగిరి 18 మార్చి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా కలెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల ఆదేశాల మేరకు తిరుమలగిరి మండలంలోని రాఘవాపురం గ్రామంలో రైతు భరోసా. స్వయం సహాయక సంఘాలకు నిధులు. స్కిల్ యూనివర్సిటీలు.200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. రైతు రుణమాఫీ 500 రూపాయలకు వంట గ్యాస్ వంటి ప్రభుత్వ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారథి సూర్యాపేట జిల్లా టీం లీడర్ పాలకుర్తి శ్రీకాంత్ సమావేశంలో మాట్లాడారు అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత వడదెబ్బ తీవ్రతపైన ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీవో భీమ్ సింగ్. టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ కుమార్. గ్రామ కార్యదర్శి సరిత. సాంస్కృతిక సారధి కళాబృందం సభ్యులు. ఈర్ల సైదులు. గడ్డం ఉదయ్. వెన్నెల నాగరాజు. మాగి శంకర్. పాక ఉపేందర్. మేడిపల్లి వేణు. మద్దిరాల మంజుల. సిరిపంగి రాధ. నెమ్మాది స్రవంతి. పోతరాజు శిరీష. గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034