పాల్సన్ రాజ్ జన్మదినము సందర్భంగా ఆహారం పంచిన ఆదరణ చారిటబుల్ ట్రస్ట్

వరంగల్, 05 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- ఆసియాలోనే అతిపెద్ద ప్రార్ధన మందిరం క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం వ్యవస్థాపకులు అపోస్తలులు ప్రవక్త డాక్టర్ సంఘాల పాల్సన్ రాజు జన్మదినము సందర్భంగా ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ బేతి సాయి కృష్ణదేవ్, సెక్రటరీ శేఖర్, జాయింట్ సెక్రెటరీ కవిత వంద మంది ప్రజలకు ఆహారం పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా చింతల సతీష్ సంఘాల సునీల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆహారం తీసుకున్న ప్రజలు సంగాల పాల్సన్ రాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా రుచికరంగా భోజనం సిద్ధం చేసినందుకు ఆదరణ ట్రస్టుకు ధన్యవాదాలు తెలియజేశారు