పబ్లిక్ క్లబ్ ను ఫ్యామిలీ క్లబ్ గా మారుస్తాము

సభ్యులు మరియు ప్రజల సహకారంతో క్లబ్ ను అభివృద్ధి చేస్తాము
పబ్లిక్ క్లబ్ నూతన ప్రధాన కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి
పబ్లిక్ క్లబ్ ను సభ్యులు మరియు ప్రజల సహకారంతో ఫ్యామిలీ క్లబ్ గా మారుస్తామని నూతనంగా ఎన్నికైన పబ్లిక్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి అన్నారు. సూర్యాపేట పబ్లిక్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికలు శనివారం నాడు క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించారు. సూర్యాపేట ఆర్డివొ , పబ్లిక్ క్లబ్ గౌరవ అధ్యక్షులైన వేణుమాధవ్ నూతన కమిటీ ఎన్నికను నిర్వహించారు. క్లబ్ సభ్యులు పెద్దసంఖ్యలో పాల్గొని నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం క్లబ్ నూతన ప్రధాన కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ
అందరం కలిసి పబ్లిక్ క్లబ్ అభివృద్ధి కోసం కలిసి మెలిసి పనిచేద్దామని చెప్పారు. గతంలో తాను క్లబ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సమయంలో దుకాణ సముదాయం నిర్మాణం చేసానని చెప్పారు. షటిల్ కోర్టు నిర్మాణం చేసి 300 మంది ప్రముఖులకు 25000/- లతో సభ్యత్వం ఇచ్చామని తెలిపారు. గతంలో పనిచేసిన కమిటీ నిధులను దుర్వినియోగం చేసిందని అన్నారు. గతంలో చేసిన ఖర్చులకు సంబంధించిన జమ ఖర్చుల వివరాలు తమకు అందిన తర్వాత పరిశీలన చేస్తామని అన్నారు. మాజీ మంత్రి, నియోజకవర్గం ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సహకారంతో పబ్లిక్ క్లబ్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకుని వస్తామని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన క్లబ్ ప్రధాన కార్యదర్శిని కొప్పుల వేణరెడ్డి ఉపాధ్యక్షులు మర్రు హనుమంతరావు,నాయకులు, సహాయ కార్యదర్శి బుల్లెద్దు దశరథ, కోశాధికారి కక్కిరేణి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు, శే న్నగాని రాంబాబు, పోలబోయిన నర్సయ్య, గవ్వ కేశవరెడ్డి, ఫరి దుద్దిన్ అహ్మద్, నిమ్మల వెంకటేశ్వర్లు, రాచకొండ శ్రీనివాస్, గవ్వ కృష్ణారెడ్డి, చల్ల సత్యనారాయణ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల, చకిలo రాజేశ్వరరావు,పోతు భాస్కర్. కాంగ్రెస్ పార్టీ అభిమానులు టౌన్ అధ్యక్షుడు మహమ్మద్ అలీ, వల్దాస్ రెబల్ శ్రీను, అబ్దుల్ రహీం, ఎలిమినేటి అభినయ్, గండూరి రమేష్, కుంభం రాజేందర్,ఆలేటి మాణిక్యం, పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సన్మానించారు