పదహారేళ్లుగా సేవలు అందించడం ప్రశంసనీయం .

Sep 29, 2024 - 09:28
Sep 29, 2024 - 20:02
 0  1
పదహారేళ్లుగా సేవలు అందించడం ప్రశంసనీయం .

పదహారేళ్లుగా సేవలందించడం ప్రశంసనీయం

- అక్షర ఫౌండేషన్ సేవలను అభినందించిన ఎంఎల్ సీ, ప్రొఫెసర్ కోదండరాం

సూర్యాపేట పదహారేళ్లుగా సేవలందించడం ప్రశంసనీయమని శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం ప్రశంసించారు. అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ కేఆర్ కన్ స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సూర్యాపేట, విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్, శరత్ మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి, హనుమకొండ, మన అమ్మ హాస్పిటల్, సూర్యాపేట వారి సౌజన్యంతో శనివారం సూర్యాపేటలోని శ్రీలక్ష్మీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన అక్షర ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలోఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. సమజాభివృద్ది, సమాజసేవే లక్ష్యంగా పని చేయుచున్న ప్రతి రంగంలో ప్రతిభావంతులను గుర్తించి ప్రత్యేక పురస్కారాలను అందజేస్తోన్న అక్షర ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ యాస రాంకుమార్ రెడ్డి సేవలు అభినందనీయం అన్నారు. ప్రతి ఒక్కరూ సమాజసేవ దిశలో అడుగులు వేయాలని, సమజాభివృద్ది కి పాటుపడాలని పిలుపు నిచ్చారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రతిభావంతులను శాలువాలు, మెమంటోలు, మెడల్స్ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త మీలా వాసుదేవ్, కుంట్ల ధర్మార్జున్, సుధీర్ కుమార్, అక్షర ఫౌండేషన్ అధ్యక్షులు ఉప్పు నాగయ్య, ప్రధాన కార్యదర్శి ఉపేంద్రాచారి, బత్తుల ఉపేందర్, నరాల తిరుమల రెడ్డి, రుద్రంగి కాళిదాసు, నజీర్ బాషా, అప్పారావు, యాస శృతి, దేవులపల్లి ప్రశాంతి, కొచ్చెర్ల గురుచరణ్ యూసుఫ్, పాపయ్య, కందాల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223