తిరుమలగిరి పిఎస్.. తిరుమలగిరి ప్రభుత్వ కళాశాల నందు వివిధ పాఠశాలల విద్యార్థులకు యాంటి డ్రగ్ పెయింటింగ్

డ్రాయింగ్, స్లొగన్స్ పోటీలు నిర్వహించి అవగాహన కల్పించారు.
డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాల నివారణలో భాగంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల ను ఉద్దేశించి రాబోయే రోజుల్లో సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థుల పాత్ర చాలా కీలకమైనది, విద్యార్థి దశ నుండి మంచి చెడు లపై అవగాహన ఉండాలి. డ్రగ్స్ వినియోగించే వారి జీవితం నాశనం అవుతుందని వారు భవిష్యత్తు కోల్పోతారని చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి చదవాలని ఎస్ఐ తెలిపారు. ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.