డ్రగ్స్ మరియు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

Sep 20, 2024 - 14:30
Sep 20, 2024 - 15:29
 0  7
డ్రగ్స్ మరియు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

డ్రగ్స్,సైబర్ నేరాలపై అవగాహన

సూర్యపేట రూరల్ PS పరిది 

ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు సూర్యాపేట రూరల్ CI సురేందర్ రెడ్డి ,SI బాలు నాయక్ మండల కేంద్రంలోని టేకుమట్ల ప్రభుత్వ పాఠశాలలో సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ మాట్లాడుతూ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అధ్వర్యంలో సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో, కళాశాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా(ATM)కార్డ్ వివరాలు(OTP)వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.సైబర్ మోసాలపై(1930)టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగం ప్రయాణించవద్దు అని వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దు,గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం నందు పాఠశాల హెడ్మాస్టర్ దైద పాపయ్య, కానిస్టేబుల్ సైదులు, ఉమా మహేష్, హోంగార్డ్ యాదయ్య, శీను ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, గురులింగం, క్రిష్ణ,చారి, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223