టీజేఎస్ రాష్ట్ర ప్లీనరీ ని జయప్రదం చేయండి.

Aug 30, 2024 - 19:25
Aug 30, 2024 - 19:37
 0  2
టీజేఎస్ రాష్ట్ర ప్లీనరీ ని జయప్రదం చేయండి.

 జిల్లా కన్వీనర్ వడ్డే బోయిన  బాబు

ఖమ్మం. 31 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్లీనరీ సెప్టెంబర్ 30న హైదరాబాదులో నిర్వహిస్తున్నామని ఖమ్మం జిల్లా కమిటీ సమావేశంలో  జిల్లా కన్వీనర్ వి.బాబు తెలిపారు . కావున ఖమ్మం జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు . అలాగే ఖమ్మం జిల్లాలో కూడా  ప్లీనరీ ని సెప్టెంబర్ 10 నుండి 20 మధ్యలో టీఎన్జీఎస్ లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు . తెలంగాణ జన సమితి కార్యక్రమల సభ్యత్వాలు మరియు సాదరణ సభ్యత్వం విస్తృతంగా జిల్లావ్యాప్తంగా  చేయించాలని సూచించారు . సభ్యత్వలు చేయడానికి ఖమ్మం జిల్లా కు జంగిపల్లి రవి , బి. నాగేశ్వరరావు , మధిరకు ఎస్.కె సర్దార్ , రామాచారి , పాలేరుకు గోపగాని శంకర్ రావు , డి.దుర్గేష్ , వైరాకు వి.మోహన్ , బి.రాజేందర్ , సత్తుపల్లి కి నరసింహారావు , బి.వినోద్ లను నియమించడం జరిగిందని అన్నారు . అశ్వరావుపేట మండలంలో జరిగే తెలంగాణ జన సమితి సదస్సుకు ప్రొఫెసర్ కోదండరాం సార్ హాజరవుతారని వారికి పౌర సన్మానం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీని ఎటువంటి షరతులు లేకుండా అన్ని రకాల రైతులకు రుణ మాఫీ రద్దు చేయాలని లేని పక్షంలో  ఆందోళనకు దిగుతామన్నారు . మున్నేరు ప్రాజెక్టు పనులు చేపట్టి ఖమ్మం ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించాలని , ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులతో సంబంధం లేకుండా అందరికీ రేషన్ కార్డులు , ఇండ్ల స్థలాలు మరియు డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని , టీజేఎస్ పార్టీ జెండా దిమ్మలను  మండలంలో గ్రామాలలో నిర్మాణం చేపట్టే బాధ్యతలు తీసుకోవాలని మరికొన్ని తీర్మానలు చేసామని తెలిపారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333