జర్నలిస్ట్ తిరుమల్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన డిజెఎఫ్ అధ్యక్షులు కాషాపోగు జాన్

జోగులాంబ గద్వాల 3మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల జిల్లా కేంద్రంలో అంగన్ వాడి టీచర్ అనంత, జర్నలిస్టు తిరుమల్ 11వ పెళ్లి రోజు వేడుకలు దళిత జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కాషాపోగు జాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంత తిరుమలల్ దంపతులిద్దరికీ పూలమాల సాలువతో సత్కరించి సీట్లు తినిపించడం జరిగింది.
ఈ సందర్భంగా డిజేఫ్ అధ్యక్షులు కాషాపోగు జాన్ మాట్లాడుతూ..
వివాహమనేది జీవితంలో చాలా పెద్ద ఘట్టం. ప్రతీ ఒక్కరి జీవితం వివాహం ముందు వివాహం తరువాతగా ఉంటుంది. భార్య లేదా భర్త జీవితంలోకి రాగానే అప్పటి వరకున్న ప్రపంచం, తరువాత ఉన్న ప్రపంచం వేరు. ఇక వారితోనే సుఖసంతోషాలన్నింటినీ పంచుకుంటాం. జీవితం ముగిసిపోయేంతవరకు మనవెన్నంటి ఉండేది జీవిత భాగస్వామే. కాబట్టి పెళ్లిరోజు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రముఖ్యం కలిగి ఉంది. అంగన్ వాడి టీచర్ గా అనంత, జర్నలిస్టుగా సమాజానికి మరణ సేవలు అందించాలని తెలియజేస్తు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకొని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రజనీకాంత్, కిరణ్ కుమార్విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు