గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ హాస్పిటల్లోనే పురుడు పోసుకోవాలి
ఎంపీడీవో శంకరయ్య
అడ్డగూడూరు 17 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు ఆదేశాల మేరకు ఎంపిడిఓ శంకరయ్య ఆధ్వర్యంలో అడ్డగూడూరు మండల పరిధిలోని అజీంపేట గ్రామ పంచాయతీలో భాషబోయిన రమ్య అనే గర్భిణీ స్త్రీ ఇంటికి వెళ్లి, రమ్య ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని,డెలివరీ కొరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూపించుకోవాలని తెలిపారు.వారికున్న అనుమానాలను నివృత్తి చేసి, ప్రభుత్వ వైద్య శాలలో కాన్పు చేయించుకోవడానికి వారిని ఒప్పించడం జరిగింది. తదుపరి తల్లీ బిడ్డ ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్ లతో కూడిన న్యూట్రిషన్ కిట్ ను బహుకరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమేష్,పి.హెచ్.సి సూపర్వైజర్, ఏఎన్ఎం ఆశ కార్యకర్తలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.