గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలి

బిజెపి లీడర్ దోసకాయల పని నాయుడు మౌనిక ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Sep 15, 2024 - 22:33
Sep 15, 2024 - 22:35
 0  8
గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలి

సూర్యాపేట 16 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట :గణనాథుడు ప్రజల సర్వ విఘ్నాలను తొలగించి సర్వ శుభాలను ప్రసాదించాలని గణేష్ నవరాత్రుల ఉత్సవ కమిటి సభ్యులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 33 వ వార్డులో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథుని విగ్రహం వద్ద బిజెపి లీడర్ దోసకాయల ఫని నాయుడు. మౌనిక దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు 33 వ వార్డు లో గత 10 సంవత్సరాలు గా  వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని  ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో గణేష్ నవరాత్రుల ఉత్సవ కమిటీ సభ్యులు, వార్డు పెద్దలు;  డాక్టర్ కర్పూరపు హర్షవర్ధన్,వజ్రపు గురుమూర్తి, వెంపటి ప్రవీణ్, గుండ వెంకన్న, పోలిశెట్టి వెంకటేశ్వర్లు చల్లా ఉపేందర్ విద్యాల శ్రీనివాస్ అచ్చయ్య కృష్ణమ్మ నాయుడు సాయిని విజయ్ చల్లా కిరణ్ సంధ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333