ఇసుక ట్రాక్టర్ సీజ్ వ్యక్తిపై కేసు నమోదు యస్ఐ డి.నాగరాజు 

Oct 1, 2024 - 08:43
Oct 1, 2024 - 08:44
 0  7
ఇసుక ట్రాక్టర్ సీజ్ వ్యక్తిపై కేసు నమోదు యస్ఐ డి.నాగరాజు 

అడ్డగూడూరు 01 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో అజింపేట గ్రామానికి చెందిన వ్యక్తి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్ ను సీజ్ చేయడం జరిగింది.వివరాల్లోకి వెళితే అజీంపేట గ్రామానికి చెందిన కన్నెబోయిన వెంకటేష్ తండ్రి రాములు అనే వ్యక్తి మండల పరిధిలో ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా తన యొక్క ట్రాక్టర్ నందు మూసి వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని వారిని మరియు ట్రాక్టర్ ను పట్టుబడి చేసి అట్టి వ్యక్తిపై కేసు నమోదు చేసి ట్రాక్టర్ ను సీజ్  చేయడం జరిగిందని ఎస్ఐ డి నాగరాజు తెలిపారు.