అడ్డగూడూరు ఎంపీఓగా బాధ్యతలు చేపట్టిన పైళ్ళ జనార్దన్ రెడ్డి
అడ్డగూడూరు 01 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల నూతన ఎంపిఓగా పైళ్ల జనార్దన్ రెడ్డి బాధ్యతలు సోమవారం రోజు చేపట్టారు గత కొన్ని సంవత్సరాలుగా ఎంపీఓ బాధ్యతలు నిర్వహించిన ప్రేమలత యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలానికి బదిలీ అయ్యారు వారి స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం నుండి అడ్డగూడూరు మండల పంచాయతీ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన పైల్ల జనార్దన్ రెడ్డి సాధారణ బదిలీలో భాగంగా కార్యదర్శిలు మండలంలోని గట్టుసింగారం గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ నవీన్ వెల్దేవి గ్రామపంచాయతీ కార్యదర్శిగా పదవి బాధ్యతలు చేపట్టారు.గత కొంతకాలంగా వెల్దేవి గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన మౌనిక రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా కునూరు గ్రామానికి బదిలీ అయ్యారు గోవిందాపురం గ్రామపంచాయతీ కార్యదర్శిగా ఎం బాలలక్ష్మి విధులలో చేరినారు.