హస్తం గుర్తుకే ఓటేద్దాం కాంగ్రెస్ పార్టీనే గెలిపిద్దాం..

Apr 18, 2024 - 19:22
 0  4
హస్తం గుర్తుకే ఓటేద్దాం కాంగ్రెస్ పార్టీనే గెలిపిద్దాం..

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతు తెలుపుతున్న కాలనీల వాసులు

రైటప్ : ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగదీశ్వర్ రెడ్డి

 తెలంగాణ వార్త ఏప్రిల్ 18 : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. గురువారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం గ్రామంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ దర్గాలో ప్రార్ధనలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్తం గుర్తుకు  ఓటు వేసి రంజిత్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో  గెలిపించాలని కోరారు. అనంతరం శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు ముక్తకంఠంతో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డికి తాము సంపూర్ణ మద్దతుగా నిలుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నర్సింగ్ రావు, నరందేర్ రెడ్డి, కార్డినెటర్ రఘునందన్ రెడ్డి, రాములు గౌడ్, డివిజన్ అధ్యక్షులు భారత్ గౌడ్, పల్లపు సురేందర్, అభిషేక్ గౌడ్, నియోజకవర్గ నాయకులు, డివిజన్ నాయకులు, మైనారిటీ నాయకులు, మహిళల అధ్యక్షులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333