సీడ్ పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని
జిల్లా కలెక్టర్ కి రైతుల పక్షాన వినతిపత్రం ను సమర్పించిన....
MRPS &BRS,కాంగ్రెస్ నాయకులు...
జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- జిల్లా కేంద్రం లో... ఈ రోజు జిల్లా లో సీడ్ పత్తి రైతులు... భారీ వర్షాల కారణం గా సరైన పంటలు దిగుబడి రకా, సీడ్ ఆర్గనైజర్లు పెట్టుబడి పైసలు ఇవ్వక పోవడం తో బయట అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టుకొన్నారు, అలాగే ఈసారి *కూలీల రేట్లు కూడా చాలా దారుణం గా పెరిగి పోవడం తో రైతులు అప్పుల పాలు అయ్యారు...!!
దీనికీ తోడు...ఆర్గనైజర్లు ప్యాకెట్ (పూత,పూత) కు ఈ సారి 450 మాత్రమే ఇస్తామని* కంపిణీ వారు చెపుతున్నారని,*చావు కబురు చల్లా గా చెపుతున్నారు, ఇలా అయితే రైతు కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుంది, కాబట్టి ఈ సారి కూడా గత సంవత్సరం మాదిరిగానే... ప్యాకెట్ కు 550 రూపాయలు ఇచ్చే విదంగా.. తగు చర్యలు తీసుకొని, మరియు రైతుల కు ఇవ్వాల్సిన పంటల పైసలు ఎప్పటి లాగానే జులై నెల లో ఇచ్చే లా ఆదేశాలు ఇచ్చి రైతుల కు న్యాయం చెయ్యాలని,రైతులతో కలిసి వినతిపత్రానందించారు... ఈ కార్యక్రమం లో.... BRS నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, MRPS నాయకులు ఐజ రాజు మాదిగ,
BRSV నాయకులు కుర్వ పల్లయ్య, సిపిఎం నాయకులు వివి నరసింహ, MRPS నాయకులు బలీగేరి ఏసన్న మాదిగ, కాంగ్రెస్ నాయకులు బింగిదొడ్డి నాగేష్, కిరణ్, చిన్న యాదవ్, మేడికొండ రామకృష్ణ*, తదితరులు పాల్గొన్నారు.