వేతనాలు చెల్లించేదాక పోరాటం. సిఐటియు
జోగులాంబ గద్వాల 3జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల వసతి గృహ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించేదాక వారికి అండగా పోరాడతామని సీఐటీయూ జిల్లా అధ్యక కార్యదర్శులు ఏ.వెంకటస్వామి వివి నరసింహ అన్నారు మంగళవారం వసతి గృహ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ వసతి గృహ కార్మికులకు 7 నెలలు బీసీ వసతి గృహ కార్మికులకు 6 నెలలుగా ప్రభుత్వం వేతనాలు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు అత్యవసర సర్వీసులతో సమానంగా వసతి గృహాలలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు నెలల తరబడి వేతనాలు పెండింగ్ లో పెడితే కార్మికుల కుటుంబాలు ఏ విధంగా బ్రతకాలని ప్రశ్నించారు ఏజెన్సీ లతో సంబంధం లేకుండా ఎస్సీ బీసీ కార్పొరేషన్ ల ద్వారా కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు జిల్లా సంక్షేమ అధికారుల నిర్లక్ష్యం బాధ్యతరాహిత్యం వల్ల వసతి గృహ కార్మికులకు పీఫ్ ESI కార్మికుల ఖాతాలో సక్రమంగా జమ కావడం లేదని విమర్శించారు ఇష్టారీతి లో మెట్రిక్ వారిని పోస్టు మెట్రిక్ కు పోస్టు మెట్రిక్ వారిని ప్రీ మెట్రిక్ హాస్టల్ కు,అధికారులకు అనుకులంగా ఉన్న వారిని జిల్లా కార్యాలయాలలో డ్యూటీ లు వేసుకుంటున్నారని విమర్శించారు బీసీ కళాశాల వసతి గృహంలో నాలుగు నెలలుగా పని చేసే వారు రావడం లేదని ఆ భారం ఉన్న ఇద్దరు కార్మికులపైనే పడుతుందని,ఈ విధంగా జిల్లా లోని అనేక వసతి గృహాలలో ఇదే పరిస్థితి నెలకొన్నదని,ఉన్న కార్మికులే అదనంగా పని బారాలు మొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాసులకు కక్కుర్తి పడి గత, ప్రస్తుత అధికారులు ఇష్టారీతి లో వసతి గృహాలలో కార్మికులను నియమించుకుంటున్నారని వారికి వేతనాల చెల్లింపులో మాత్రం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని విమర్శించారు చనిపోయిన సస్పెండ్ అయిన వారి స్థానాలలో ఏళ్ల తరబడి పని చేస్తున్న వారిని కాకుండా,ఏటువంటి నోటిఫికేషన్ జారీ చేయకుండా వర్కర్స్ ను నియమించుకుంటున్నారని విమర్శించారు దీనివల్ల ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారికి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా అధికారులు వసతి గృహాలలో పని చేస్తున్న కార్మికులకు నియామక పత్రాలు వారి హోదాలు తెలిపే జాబ్ చార్ట్ ను ఇవ్వాలని డిమాండ్ చేశారు వసతి గృహ కార్మికుల వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరించకపోతే దీర్ఘ కాల ఉద్యమం చేపడతామని హెచ్చరించారు అనంతరం డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ గారికి అందజేశారు ఈ కార్యక్రమంలో వసతి గృహ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంజిత్ కుమార్ ఆనంద రాజు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ వసతి గృహ కార్మికుల సంఘం జిల్లా కోశాధికారి జయాకర్ ఉపాధ్యక్షులు శశికళ లక్ష్మి సహాయ కార్యదర్శులు ప్రవలిక చింతరెవుల కార్మికులు గోపాల్ హైమావతి రామకృష్ణ అంజి శ్రీదేవి పద్మ తదితరులు పాల్గొన్నారు