వెల్దేవి గ్రామంలో నిశ్శబ్దంగా కొనసాగుతున్న ఎలక్షన్ వినియోగించుకుంటున్న ఓటర్లు
అడ్డగూడూరు13 మే 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం పరిధిలోని వెల్దేవి గ్రామంలో 13/05/2024 సోమవారం పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో వివిధ పట్నాల నుండి వచ్చిన ఓటర్లు ఎంపీ ఎలక్షన్ ఓటర్ దారుల నిశ్శబ్దంగా తన అమూల్య ఓటును వినియోగించుకుంటున్నారు. ఉదయం7 గంటలకు నుండి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారు. ఉదయం11.30 నిమిషాల వరకు35 శాతం ఓట్లు నమోదు అయినట్లు తెలుస్తుంది.ఆ గ్రామానికి వచ్చిన పోలింగ్ అధికారులు,సిబ్బంది పగిడిబందీగా వ్యవహరిస్తున్నారు. సాయంత్రం 5 గంటల లోపు పూర్తిస్థాయిలో పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు.