లాయుడ్ గ్యాలరీ అనుమ్ ఎలక్ట్రానిక్స్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
తెలంగాణ లాయిడ్ కంపెనీ ఆర్ ఎం జీవన్ కామినేని,
బ్రాంచ్ మేనేజర్ భురంగి సురేంద్ర
సూర్యాపేట 06 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట: లాయుడ్ కంపెనీ బ్రాంచీని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ లాయిడ్ కంపెని ఏ ఆర్ ఎం జీవన్ కామినేని బ్రాంచ్ సురేంద్ర అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటుచేసిన లాయుడ్ ఏసీ కంపెనీని హమీదా సిస్టం వారి ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించి మాట్లాడారు. ప్రజల కు అత్యంత నమ్మకం కలిగిన లాయిడ్ కంపెనీని సూర్యాపేటలో ప్రారంభించినందుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా లాయిడ్ కంపెనీ బ్రాంచీలు దాదాపు ఆరు ఉన్నాయని అందులో భాగంగా గత సంవత్సరం నల్గొండ జిల్లాలో ప్రారంభించామని ప్రజలు తమ కంపెనీని ఆదరించారని ఈ సంవత్సరం సూర్యాపేటలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా హామీదా సిస్టం బాబా ఫరీద్ మాట్లాడుతూ లాయిడ్ కంపెనీ బ్రాంచిని సూర్యాపేట జిల్లా ప్రజలు సద్వినియోగ పరచుకోవాలని ఇందులో బ్రాండెడ్ లాయుడ్ హావెల్స్ కంపెనీ ఏసీలు ఎల్ఈడి టీవీలు, వాషింగ్ మిషన్, తవార్ ఏసిలు, ఫ్రిజ్ లు, తదితరు ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లాయిడ్ కంపెనీ ఏఎస్ఎమ్ అనిల్ కుమార్, మార్కెట్ హెడ్ శంకర్, కుతుబుద్దిన్, ఎండి అజయ్, మన్సూర్ భాయ్, యాసీన్ అలీ, యాసరు అహ్మద్, ఎండి ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.