మంత్రి ఉత్తం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో 17 మంది కౌన్సిలర్ల చేరిక

సూర్యాపేట:- సూర్యాపేటకు మున్సిపాలిటీకి చెందిన 17 మంది బీ ఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఇటీవల మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ విషయంలో జరిగిన అవిశ్వాస తీర్మానం కు సంబంధించి మనస్థాపన చెంది బీ ఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తాజాగా బుధవారం వారందరూ హైదరాబాదులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన 17 మంది కౌన్సిలర్లు మాజీ మంత్రి, సూర్యపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డి, ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిలు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు.