భువనగిరి బిఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ని గెలిపించండి
తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షుడు అమరారపు తిరుమలేష్ మాదిగ
తుంగతుర్తి ఏప్రిల్ 5 తెలంగాణవార్త ప్రతినిధి:- దళిత బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తున్న భువనగిరి టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ గెలిపించాల్సిందిగా తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షుడు అమరారపుతిరుమలేష్ మాదిగ పిలుపునిచ్చారు.
శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుమలేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి ప్రదాత మాజీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా తయారైంది అని అన్నారు.
అభివృద్ధిని జీర్ణించుకోలేని కొంతమంది దళారులు కేసీఆర్ కుటుంబం మీద లేనిపోని అవాకులు చవాకులు పెరగడం పేలడం సరైనది కాదని అన్నారు.
రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు, దళిత బందును కల్పించినటువంటి ఘనత ఒక్క బిఆర్ఎస్ పార్టీకి దక్కింది అన్నారు. కొన్ని దశాబ్ద కాలంగా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తున్న క్యామ మల్లేష్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాము.