బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం

జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్

Jul 23, 2024 - 20:24
Jul 23, 2024 - 20:54
 0  52

సూర్యాపేట టౌన్/ 23 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ విమర్శించారు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధుల కేటాయింపు సరిగా లేదని అన్నారు. తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురు బిజెపి ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం బడ్జెట్లో మోడీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. మోడీకి ఆదాని, అంబానీ  మీద ఉన్న ప్రేమ రాష్ట్రం పైన లేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు  బడ్జెట్లో  అన్యాయం జరిగిందన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333