బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి
మాజీ మంత్రి రాoరెడ్డి దామోదర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
అడ్డగూడూరు 30 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి రాoరెడ్డి దామోదర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.తుంగతుర్తి,సూర్యాపేట నియోజకవర్గాల ప్రజల ఆశా కిరణం,టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు,మాజీ మంత్రి టైగర్ రాంరెడ్డి దామోదర్ రెడ్డిని,మరియు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సోమవారం రోజు హైదరాబాదులోని వారి నివాసంలో తుంగతుర్తి నియోజకవర్గ అడ్డగూడూరు మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గూడెపు పాండు,బొమ్మగాని లక్ష్మయ్య,అడ్డగూడూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కడారి రమేష్,టిపిసిసి నాయకులు గూడెపు నాగరాజు,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కప్పల రాజేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారిశెట్టి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.