ప్రజావాణిలో 15 ఫిర్యాదులు స్వీకరణ ఎస్పీ

Nov 17, 2025 - 19:18
 0  1
ప్రజావాణిలో 15 ఫిర్యాదులు స్వీకరణ ఎస్పీ

 జోగులాంబ గద్వాల 17 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:  గద్వాల   ప్రజావా ఎస్పీణి కార్యక్రమంలో  భాగంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి 15 మంది పిర్యాదుదారులు వివిధ సమస్యలపై  నేరుగా జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ కి ఫిర్యాదులు అందించారు. బాధితులు అందజేసిన ప్రతి ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ స్పందించి స్వయంగా ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్టేషన్ అధికారులకు తక్షణమే సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అదేశాలు జారీ చేశారు. అలగే అక్కడే ఉన్న  డి. ఎస్పీ మొగిలయ్య, శాంతి నగర్  సర్కిల్ అధికారులకు ఆయ పరిదిలో నీ ఫిర్యాదుల పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా 
ఫిర్యాదుదారులకు న్యాయం జరుగుతుందనే బరోసాను కలిగించే విధంగా పోలీస్ అధికారుల పనీతిరు ఉండాలని అన్నారు. 

ఈ రోజు ప్రజావాణిలో  మొత్తం 15ఫిర్యాదులు 

భూ వివాదాలకు సంబందించి - 06
కుటుంబ తగాదాలకు సంబందించి -01
గొడవలకు సంబంధించి - 02
ఇతర అంశాలకు సంబంధించి -06 పిర్యాదులు వచ్చాయి అని పిఆర్ఓ ఆఫీస్ నుంచి తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333