పిడిఎస్ బియ్యం పట్టివేత

Jun 22, 2024 - 21:45
Jun 22, 2024 - 22:35
 0  249
పిడిఎస్ బియ్యం పట్టివేత

తిరుమలగిరి 23 జూన్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండలం రాజా నాయక్ తండ లో మాలోత్ రంగమ్మ యొక్క ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 11 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని తెలిసిన సమాచారం మేరకు తిరుమలగిరి ఎస్సై సత్యనారాయణ గౌడ్ తన సిబ్బందితో వెళ్లి పట్టుబడి  అట్టి పీడియస్ బియ్యాన్ని అక్రమంగా నిలువ ఉంచిన ధరావత్ బిచ్చ తండ్రి అనుమ వయసు 33 సంవత్సరాలు, గ్రామం :రాళ్ల జనగాం యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా తాను చుట్టుపక్కల గ్రామాలలో తిరుగుతూ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన పిడిఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ, ఇతర ప్రాంతాలలో అధిక ధరలకు విక్రయిస్తూ ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేస్తూ అక్రమ లాభం పొందుతున్నట్టు చెప్పినాడు, అట్టి వ్యక్తిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం అయినది 

Jeripothula ramkumar Tirumalagiri Mandal Reporter Suryapet District Telangana State