నేటి నుండి మహా కుంభమేళాకు వందే భారత్ రైలు

హైదరాబాద్ :ఫిబ్రవరి 15 : ఈనెల 26న మహా కుంభమేళా ముగియ నుంది. కుంభమేళాను సందర్శించలేక నిరాశతో ఉన్న భక్తుల కోసం వందే భారత్ స్పెషల్ ట్రెయిన్ నడపనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఉత్తర రైల్వే ఫిబ్రవరి 15, 16 మరియు 17 తేదీల్లో న్యూ ఢిల్లీ మరియు వారణాసి మధ్య ప్రయాగ్రాజ్ ద్వారా వందే భారత్ ప్రత్యేక రైలును నడపనుంది.
వందే భారత్ ప్రత్యేక రైలు నంబర్ 02252 న్యూఢిల్లీ నుండి ఉదయం 5.30 గంటలకు ప్రయాగ్రాజ్ ద్వారా మధ్యాహ్నం 12.00 గంటలకు బయలుదేరి 2.20 గంటలకు వారణాసి చేరుకుంటుందని, ఉత్తర రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది.
తిరిగి వెళ్ళే దిశలో, రైలు నంబర్ 02251 వారణాసి నుండి 3:15 గంటలకు ప్రయాగ్రాజ్ 4:20 గంటలకు బయలుదేరి అదే రోజు 23:50 గంటలకు న్యూఢిల్లీ, చేరుకుంటుం దని,ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు.
వారాంతంలో కుంభమేళా కు రద్దీ ఎక్కువగా ఉంటుం దని అంచనా వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు...