దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
ఖమ్మం జిల్లా దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.
, 09 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్::- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు పమ్మి అనిత అధ్యక్షతన ఓ ప్రైవేట్ ఫంక్షన్ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దిశ ఫౌండర్ అండ్ చైర్మన్ బీవీ రాజు హాజరు కాగా దిశా కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడీ టీచర్లకు ఆశా వర్కర్లకు సన్మానం చేశారు . స్థానికంగా ఉన్నటువంటి పేద మహిళా కుటుంబాలకు చీరల పంపిణీ కార్యక్రమం అలాగే వారికి ఆహారాన్ని అందించడం జరిగింది . ఈ సందర్భంగా అధ్యక్షురాలు పమ్మి అనిత మాట్లాడుతూ స్థానిక సమస్యల గురించి అలాగే మహిళల యొక్క స్వావలంబన వారి పరిరక్షణ గురించి వివరించారు . ప్రతి మహిళ ఒక శక్తిగా రూపాంతరం చేయాల్సిందిగా ఈ కార్యక్రమంలో ఆమె పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో దిశా కమిటీ జనరల్ సెక్రెటరీ ఫణి కుమారి , సుష్మశాలిని , బిందు , సుజాత , స్వప్న , మధుమాల , శ్రీదేవి , ఉమా , విజయ , షాహిన్ కమిటీ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేశారు .