డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన""నాగారం పిఎస్ పరిధి

Feb 12, 2025 - 14:22
Feb 12, 2025 - 14:57
 0  18
డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన""నాగారం పిఎస్ పరిధి

 తెలంగాణ వార్త ప్రతినిధి నాగారం :  డ్రగ్స్,సైబర్ నేరాలపై అవగాహన

 ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు నాగారం SI అయిలయ్య గారు, మండల కేంద్రంలోని ఫణిగిరి మేరీ మదర్ హై స్కూల్ లో సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.

     SI అయిలయ్య గారు మాట్లాడుతూ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి అధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై , సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో, కళాశాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,* *ATM* *కార్డ్ వివరాలు,* *OTP* *వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.* *సైబర్ మోసాలపై* *1930* *టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగం ప్రయాణించవద్దు అని వేధింపులపై* *100* *కు* *సమాచారం ఇవ్వాలని తెలిపినారు.

 వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు*  

              డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను* *అతిక్రమించొద్దు అని అన్నారు.

 అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థిని విద్యార్థులకు, అవగాహన* *కల్పించారు

 *ఈ కార్యక్రమం నందు మేరీ మదర్ హై స్కూల్ మేనేజర్ సిస్టర్ రీనా జేవియర్, ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ రోస్ మేరీ, అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయురాలు నీను ఫ్రాన్సిస్, స్టాఫ్ సెక్రటరీ సతీష్, కానిస్టేబుల్ కమలాకర్, కానిస్టేబుల్ నరేష్, కానిస్టేబుల్ రాము, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, క్రిష్ణ,చారి, గురులింగం, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.*

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State