చైనా మంజ విక్రయిస్తే చర్యలు తప్పవు ఎస్సై వెంకట్ రెడ్డి
తిరుమలగిరి 12 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ఎస్సై వెంకట్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడం మన ఆనవాయితీ అయితే, కొంతమంది నిషేధిత చైనా మాంజా (సింథటిక్/నైలాన్ దారం) వినియోగిస్తుండటం వల్ల పక్షులు, మూగజీవాలు, మనుషుల ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతోంది అని అన్నారు ఈ నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా పోలీస్ శాఖ కఠిన నిబంధనలు అమలు చేస్తుందని అన్నారు వాహనదారులు, పాదచారుల గొంతు కోసుకుపోయి ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఉన్నాయని ఆకాశంలో ఎగిరే పక్షులు ఈ దారంలో చిక్కుకుని, రెక్కలు తెగిపోయి మరణిస్తున్నాయన్నారు....