చిత్తలూరు గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళన
శాలిగౌరారం 01 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని చిత్తలూరు జిల్లా పరిషత్ హై స్కూల్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం 28 సంవత్సరాల తర్వాత 1991 96 బ్యాచ్కు చెందిన చిత్తలూరు జిల్లా పరిషత్ పదవ తరగతి విద్యార్థులు గురువులు ఆత్మీయంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఘనంగా సత్కరించి చిన్ననాటి స్నేహితులు గురువులను కలిసి మరొక మారు వారంతా చిన్నతనంలోకి వెళ్లిపోయారు అప్పటి జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసుకుని చిన్న పిల్ల లాగా ఆడుతూ పాడుతూ రోజంతా గడిపారు
చిన్నతనంలో ఏర్పడిన స్నేహము కల్లాకపటం లేనిది మరియు పవిత్రమైనది ఇలా వారందరూ స్నేహితులను కలిసి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుని ఒకరికొకరు ఓదార్పును సపోర్ట్ ను ఇవ్వడం ఎంతో ఉత్తమమైన ఆచార ఇలా విద్యా తర్వాత ఎవరికి వారన్నట్టుగా ఉండకుండా ప్రతి ఒక్కరు సమాజంలో సంఘటితంగా జీవిస్తూ ఒకరికొకరు సపోర్టుగా నిలవడం అనేది మంచి ఆచారం ఇలా ప్రతి ఒక్కరు దీనిని భవిష్యత్ తరాలకు తీసుకువెళ్లి సమాజంలో సంఘటితత్వాన్ని నెలకొల్పాలని కోరుకుంటున్నాను ఇలా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థులకు గురువులకు నా యొక్క శుభాకాంక్షలు ఇలాగే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కలిసిమెలిసి జీవించాలని కోరుకుంటున్నాను ఇట్లు కన్నబోయిన నర్సయ్య యాదవ్ తదితల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.