కోడి పందేల నిర్వాహకులపై కేసు నమోదు మద్దిరాల ఎస్ఐ వీరన్న

మద్దిరాల 28 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని కోడి పందేల నిర్వాహకులపై కేసు నమోదు చేసిన ఎస్ఐ వీరన్న తెలిపారు.సంఘటన జరిగిన వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చందుపట్ల గ్రామంలో ఓ రైతు వ్యవసాయ భూమిలో ఆ గ్రామానికి చెందిన సురేష్,మహేష్,ఊకళ్లు గ్రామానికి చెందిన లక్ష్మణ్,శ్రీను,పస్తాల గ్రామానికి చెందిన ఎల్లయ్య,నూతనకల్లుకి చెందిన సైదు వెంకట నాగరాజు కొన్ని రోజులగా కోడి పందేలు నిర్వహిస్తున్నారునీ తెలుసుకొని సమాచారం ప్రకారంగా సంఘటన స్థలానికి చేరుకొని నాలుగు పందెం కోళ్లు,16 కత్తులు,రెండు బైక్ లు,5సెల్ఫోన్లు,ఆటోతో పాటు రూ.4,800 స్వాధీనం చేసుకుని ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ముద్దిరాల ఎస్ఐ ఎం వీరన్న తెలిపారు.