కాంగ్రెస్ పార్టీ ఐజ జన జాతర భారీ ర్యాలీని జయప్రదం చేయండి
జోగులాంబ గద్వాల 10 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఐజ. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రేపు ఉదయం అనగా 11/04/2024 శనివారం రోజు ఉదయం 6:30 గంటలకు AICC కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ SA సంపత్ కు మార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి ఓల్డ్ బస్టాండు, ఓల్డ్ పోలీస్ స్టేషన్, సంత బజార్, ఎస్సీ కాలనీ, నీలకంట రాయుని గుడి మీదుగా కొత్త బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించబడును కావున కార్యకర్తలు అభిమానులు నాయకులు, రైతులు, రైతు సంఘ నాయకులు, మహిళలు, యువకులు అందరూ సకాలంలో రాగలరని మనవి. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి , నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ పివి మోహన్ , ఏఐసీసీ సెక్రెటరీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ , ఐజ(తెలంగాణా )మండల్ ఏఐసీసీ అబ్జర్వర్ రాజు జెమ్ ఖండికర్ పాల్గొంటారు. కావున కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీలు మండల నాయకులు మండల అధ్యక్షులు పట్టణ నాయకులు పట్టణ అధ్యక్షులు కార్యకర్తలు అభిమానులు అందరూ సకాలంలో హాజరు కాగలరని విజ్ఞప్తి.