కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
ములుగు తెలంగాణ వార్త డిసెంబర్ 24:- - కళ్యాణ లక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు అందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క కన్నాయిగూడెం మండలం కేంద్రంలోని రైతు వేదికలో మండలం లోని 27 మంది లబ్ధిదారులకు,ఏటూరు నాగారం తహశీల్దార్ కార్యాలయంలో 45 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాది ముభారక్ చెక్కులను రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలిసి పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ గారు మరియు ఆర్డీఓ వెంకటేష్, తహసిల్దార్ వేణు గోపాల్, ఎం పి డి ఓ అనిత, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.