ఏకరూప దుస్తులు పంపిణీ కార్యక్రమం
జోగులాంబ గద్వాల 17 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: ఇటిక్యాల ఈరోజు ఇటిక్యాల మరియు ఎర్రవల్లి మండలం లోని ప్రాథమిక, ప్రాథమికున్నత, ఉన్నత పాఠశాల, ప్రధానోపాధ్యాయులకు సమావేశాన్ని నిర్వహించి , ఇటిక్యాల మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్ల మరియు ఎర్రవల్లి మండల విద్యాశాఖ అధికారి *అమీర్ పాషా . ఆధ్వర్యంలో
ప్రధానోపాధ్యాయులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేయడం జరిగింది..
ఈ కార్యక్రమానికి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు మండలంలోని ప్రధానోపాధ్యాయులు పాల్గొనడం జరిగింది, అలాగే ప్రధానోపాధ్యాయుల నుండి మండలంలోని టైలర్స్ కు ఏకరూప దుస్తుల పంపిణీ జరిగింది .ఈ కార్యక్రమంలో మండలం మహిళా సమాఖ్య APM ,MEO ఆఫీస్ సిబ్బంది మరియు మండల టైలర్స్ తదితరులు ఉన్నారు.