షీ టీమ్స్, సైబర్ నేరాల పై అవగాహన

సూర్యాపేట టౌన్ 14 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్పి నాగేశ్వరరావు సూచనలతో* *సూర్యాపేట షీ టీమ్స్ మహిళా SI నీలిమ పట్టణం లోని SV ఇంజనీరింగ్ కాలేజీ లో షీ టీమ్స్, డ్రగ్స్, సైబర్ నేరాలపైన పోలీసు కళాభృందంతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.
షీ టీమ్స్ మహిళ SI నీలిమ మాట్లాడుతూ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ అధ్వర్యంలో షీ టీమ్స్, సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా, ATM కార్డ్ వివరాలు, OTP వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.
ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే సూర్యాపేట షీ టీం ఫోన్ నెంబర్ 8712686056 కి సమాచారం ఇవ్వండి మీయొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొద్దు అని అన్నారు.
యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. పుట్టిన తేదీలను,ఫోన్ నెంబర్లను పాస్వర్డ్ గా పెట్టుకోవద్దు అని సూచించారు. సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన* *పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు. అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం నందు SV ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ మరియు బోధన సిబ్బంది, మహిళా సాధికారత జిల్లా కోఆర్డినేటర్ చైతన్య, షీ టీమ్స్ ASI సాలయ్య, పోలీస్ కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, సభ్యులు గోపయ్య, నాగార్జున, మరియు ఉపాధ్యాయునిలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.