ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు
జోగులాంబ గద్వాల 4 అక్టోబర్ తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి. జింకలపల్లి స్టేజి సమీపాన 44వ జాతీయ రహదారి పైన హైదరాబాదు నుంచి వస్తున్న కారు వనపర్తి డిపోకు సంబంధించిన ఆర్టీసీ బస్సును వెనకనుంచి కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టినట్లు ప్రయాణికులు తెలిపారు. ఆర్టీసీ బస్సులో సీట్ కెపాసిటీ మరియు ఆర్టీసీ బస్సులో నిలబడి ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని ప్రయాణికులు తెలియజేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు గాని ఏ ప్రమాదం జరగలేదని ప్రయాణికులు తెలియజేశారు. కారులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేదని ఆర్టీసీ బస్సులో ఉన్న వాళ్ళు తెలిపారు. 44వ జాతీయ రహదారి పైన ప్రయాణికులకు వాహనదారులకు అరగంటకు పైన అంతరాయం కలగడం జరిగింది.