ఆర్.ఎం.పి పి.ఎం.పి ల పై దాడులు ఆపాలి...... ఎరుకల శ్రీశైలం

Jun 4, 2024 - 19:34
Jun 4, 2024 - 19:53
 0  5
ఆర్.ఎం.పి పి.ఎం.పి ల పై దాడులు ఆపాలి...... ఎరుకల శ్రీశైలం

మునగాల 04 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మునగాల మండల కేంద్రంలో ఆర్.ఎం.పి పిఎంపి మండల అధ్యక్షులు ఎరుకల శ్రీశైలం అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆర్.ఎం.పి పి.ఎం.పి లకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ జారీ చేస్తానని వారు వాగ్దానం చేశారు, అని ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఆర్.ఎం.పి ,పి.ఎం.పీ, ల మీద దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ట్రైనింగ్ ఇచ్చి ఒక సర్టిఫికెట్లు జారీ చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆర్ఎంపీలు పీఎంపీలు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలకు, ధర్నాలకు ,బందులకు ,దిగుతామని వారు అన్నారు. ఈ సమావేశానికి జిల్లా నాయకులు దొంతకాని రవిబాబు ,గౌరవ అధ్యక్షులు రహీం ,ఉపాధ్యక్షులు ఆదినారాయణ, అనిల్ కుమార్, రవిబాబు, ప్రధాన కార్యదర్శి చీరందాసు ఉపేంద్ర ,చారి కోశాధికారి చెరుకు బాబు ,ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ ఖాదర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మండవ శ్రీనివాస్ గౌడ్, ప్రచార కార్యదర్శి సాయి, కమిటీ సభ్యులు రజనీకాంత్, కనకాచారి, పాషా, నరసింహారావు ,శ్రీను ,నవీన్ ,వినయ్, తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State